Wednesday, April 12, 2006

 

ఎప్పుడు మొదలైంది.

ఫ్రాన్స్ దేశానికి చెందిన లుమేర్ బ్రదర్స్ 1896లో ఆరు లఘు చిత్రాలను (షార్ట్ ఫిల్ములు) ముంబాయిలో ప్రదర్శించారు. అప్పటి నుంచి సినిమా కెమెరా భారతదేశంలో స్థిరపడింది.

1899లో హరిశ్చంద్ర భట్వాడేకర్ అనే వ్యక్తి భారతదేశంలో తొలి లఘు చిత్రాన్ని నిర్మించడంతో చలనచిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

1913లో దుందిరాజ్ గోవింద్ ఫాల్కే (దాదా సాహెబ్ ఫాల్కే) గారు రాజా హరిశ్చంద్ర పేరిట తొలి పూర్తి నిడివి మూగ చిత్రాన్ని నిర్మించి భారత దేశంలో తొలి సినిమా నిర్మించిన ఘనతను సాధించారు.
(త్వరలో మరికొన్ని...)

Comments: Post a Comment



<< Home

This page is powered by Blogger. Isn't yours?